14 హిందూ దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం
గుర్తు తెలియన దుండగులు దాదాపు 14 హిందు దేవాలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: గుర్తు తెలియన దుండగులు దాదాపు 14 హిందు దేవాలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. "గుర్తుతెలియని వ్యక్తులు చీకటి ముసుగులో దాడులకు పాల్పడ్డారు, మూడు యూనియన్లోని 14 దేవాలయాలలోని విగ్రహాలను ధ్వంసం చేసారు" అని బలియాడంగిలో హిందూ సంఘం నాయకులు బిద్యనాథ్ బర్మాన్ అన్నారు. ''దేశంలోని శాంతియుత పరిస్థితులకు విఘాతం కలిగించేందుకు జరిగిన దాడిగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది'' అని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు.