విషాదం : చెరువులో పడి ఇద్దరు రైతులు మృతి

దిశ, ముధోల్ :  నిర్మల్ జిల్లా తానూర్ మండలం‌లోని కళ్యాణి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు  ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ముధోల్ సీఐ వినోద్ తెలిపిన వివరాల ప్రకారం .. కళ్యాణి గ్రామానికి చెందిన శిర్ సాగర్ గౌతం(47), బుద్దవంత్ సచిన్ (20)అను ఇద్దరు రైతులు బుధవారం తమ పంట పొలంలో శనగ విత్తనాలు అలికి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పొలం పని ముగించుకోని ఎద్దులను కడగటానికి మసల్గా […]

Update: 2021-11-03 09:18 GMT

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా తానూర్ మండలం‌లోని కళ్యాణి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ముధోల్ సీఐ వినోద్ తెలిపిన వివరాల ప్రకారం .. కళ్యాణి గ్రామానికి చెందిన శిర్ సాగర్ గౌతం(47), బుద్దవంత్ సచిన్ (20)అను ఇద్దరు రైతులు బుధవారం తమ పంట పొలంలో శనగ విత్తనాలు అలికి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పొలం పని ముగించుకోని ఎద్దులను కడగటానికి మసల్గా చెరువుకు వెళ్లారు. ఎద్దులు కడుగుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు అక్కడి స్థానికులు పేర్కొన్నారు. గౌతం‌కు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, సచిన్‌కు గత 6 నెలల క్రితం పెళ్లి జరిగింది. తండ్రి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News