పొలంలోనే పురుగులమందు తాగిన రైతు

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అప్పులబాధ తట్టుకోలేక ఓ రైతు పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని నడ్డివారిగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన రామలింగయ్య అనే రైతు తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంట సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి దిగుబడి లేక.. అప్పు చేసిన 12 లక్షలు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపం చెంది, […]

Update: 2020-10-26 21:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అప్పులబాధ తట్టుకోలేక ఓ రైతు పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని నడ్డివారిగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన రామలింగయ్య అనే రైతు తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంట సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి దిగుబడి లేక.. అప్పు చేసిన 12 లక్షలు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపం చెంది, చేనులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News