త్వరలోనే కేటీఆర్ చిట్టా మొత్తం విప్పుతా.. ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-29 07:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. త్వరలోనే కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా బయటపెడతానని.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అక్రమ ఆస్తులపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సైతం బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ఉద్దేశం బీజేపీకి లేదని బండి క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత చేస్తారంటూ కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వేములవాడలో కేటీఆర్ మాట్లాడుతూ.. జూన్ 2 వరకే హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత హైదరాబాద్‌ను బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందంటూ కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత చేయకుండా అపగలిగే శక్తి ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి పై విధంగా కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News