ఆ విషయంలో మనస్థాపం చెంది యువరైతు ఆత్మహత్య

Update: 2022-03-03 16:13 GMT

దిశ, సైదాపూర్: భూమి పంచాయతీ విషయంలో మనస్థాపం చెంది యువరైతు వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లె గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం జాగిరిపల్లె గ్రామానికి చెందిన ఖమ్మం వినయ్ కుమార్ (35) అనే యువరైతు తన వ్యవసాయ బావి వద్ద గురువారం వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి కారణమైన అదే గ్రామానికి చెందిన ఖమ్మం సమ్మయ్య, ఖమ్మం చంద్రయ్య, భూర్ల భాస్కర్, భూర్ల మల్లయ్య, ఖమ్మం కమల, ఖమ్మం వినీత్, ఖమ్మం వివేక్, ఖమ్మం విశాల్, దొడ్డి సురేష్, దొడ్డి గట్టయ్య, ఖమ్మం మహేంద్ర, ఖమ్మం ఉదయ్, ఖమ్మం కావ్య, గంజి అలేఖ్య లతో భూమి పంచాయతీ విషయంలో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి జయ ఫిర్యాదు మేరకు 14 మందిపై ఐపీసీ 306 ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చల్ల మధుకర్ రెడ్డి తెలిపారు. మృతునికి భార్య కూతురు కుమారుడు ఉన్నారు.

Tags:    

Similar News