ఇంగ్లాండ్పై చెలరేగిన పంత్.. ధోనీ 17ఏళ్ల రికార్డ్ బ్రేక్..
ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ రీషెడ్యూల్ టెస్ట్లో టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్, కీపర్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు.
దిశ, వెబ్డెస్క్: ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ రీషెడ్యూల్ టెస్ట్లో టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్, కీపర్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. కీలక వికెట్లు కోల్పోయి జట్టు ఆపదలో ఉన్న సమయంలో క్రీజ్లోకి వచ్చిన పంత్ ఆద్భుతమైన షాట్లతో అలరించాడు. ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన పంత్ కేవలం 89 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 111 బంతులు ఎదుర్కొన్న పంత్ 20ఫోర్లు, 4 సిక్సర్లతో విలువైన 146 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్లో సెంచరీ సాధించిన పంత్.. టీమిండియా మాజీ కెప్టెన్, కీపర్ ధోనీ 17ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేశాడు. 2005లో పాకిస్థాన్పై ధోనీ 93 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీనితో ఇప్పటి వరకు టెస్టుల్లో భారత్ తరపున వేగవంతమైన సెంచరీ చేసిన వికెట్ కీపర్గా ధోనీ కొనసాగుతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్పై కేవలం 89 బంతుల్లోనే సెంచరీ బాదిన పంత్.. ధోని 17ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసి.. ఇండియా తరపున టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ చేసిన వికెట్ కీపర్గా పంత్ రికార్డులోకెక్కాడు.