ఓయూలో ప్రధాని మోడీ దిష్టి బోమ్మ దహనం!

ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్ధి నాయకులు మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు.

Update: 2024-04-29 09:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్ధి నాయకులు మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. రాజ్యాంగం మారుస్తామని, రాజ్యాంగానికి వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నాయకులపై మండిపడుతూ.. ఓయూలోని విద్యార్ధి సంఘం నాయకులు ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. డా. బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యంగాన్ని విచ్చిన్నం చేసి రిజర్వేషన్లను తొలగించే కుట్రలు చేస్తున్న బీజేపీని అడ్డుకొని తీరుతామని విద్యార్ధి సంఘ నాయకులు హెచ్చరించారు. అంబేద్కర్, మహాత్మా జ్యోతి బాపులే ల ఫోటోలు పట్టుకొని భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, ఖబర్ధార్ మోడీ, ఖబర్ధార్ ఆర్ఆర్ఎస్ శక్తుల్లారా.. అంటూ మోడీ, ఆర్ఎస్ఎస్ లకు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. కాగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకులు రిజర్వేషన్లపై పలు వ్యాఖ్యలు చేస్తుండటంతో తీవ్ర వివాదం చెలరేగుతోంది. దీంతో బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై విపక్షాలే కాక పలు విద్యార్ధి సంఘాల నాయకులు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Read More...

ఓయూ విద్యార్థుల నిరసనకు దిగోచ్చిన ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం ఆదేశాలు 

Tags:    

Similar News