కేసీఆర్కిట్ నుంచి జాన్సన్ బేబి పౌడర్ ఔట్
కేసీఆర్ కిట్ నుంచి జాన్సన్ అండ్ జాన్సన్ బేబి పౌడర్ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ కిట్ నుంచి జాన్సన్ అండ్ జాన్సన్ బేబి పౌడర్ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పౌడర్తో రీయాక్షన్లు వస్తున్నట్లు ఇటీవల అమెరికాతో పాటు కొన్ని దేశాలు చేసిన స్టడీల్లో తేలింది. ఈ కారణంగానే జాన్సన్ పౌడర్ను నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కిట్లలో ఉన్న పౌడర్ డబ్బాలను సేకరించి భద్రపరచాలని కమిషనర్శ్వేతా మహంతీ అన్ని జిల్లాల డీఎమ్హెచ్ఓలకు సూచించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వాటిని వాడకుండా చూడాలన్నారు.