BREAKING: మల్కాజ్‌గిరి పార్లమెంటును బీజేపీకి తాకట్టు పెట్టిన కేసీఆర్: సీఎం రేవంత్‌రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానాన్ని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టిండని సీఎం రేవంత్‌రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Update: 2024-05-06 16:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానాన్ని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టిండని సీఎం రేవంత్‌రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇవాళ ప్రచారంలో భాగంగా ఆయన ఉప్పల్ జరిగిన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరి బరిలో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా ఓ దిష్టి బొమ్మను పోటీలో దింపిందని ఎద్దేవా చేశారు. అసలు తమకు కేసీఆర్ పోటీయే కాడని రేవంత్ స్పష్టం చేశారు. అనంతరం ఆయన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బడుగు, బలహీనవర్గాల కోసం మంత్రి పనిచేసిన ఈటల రాజేందర్ ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌తో పంపకాల్లో పంచాయితీ వచ్చి బీఆర్ఎస్ బయటకు వచ్చాడే కానీ.. ప్రజల కోసం ఆయన ఆ పార్టీ నుంచి బయటకు రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు.  

Tags:    

Similar News