HYD: నగరవాసులకు బిగ్ అలర్ట్.. ఉప్పల్‌లో మ్యాచ్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్‌ వేదికగా రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో చివరి లీగ్ మ్యాచ్‌లో హోం టీం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి.

Update: 2024-05-19 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్‌ వేదికగా రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో చివరి లీగ్ మ్యాచ్‌లో హోం టీం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. బోడుప్పల్‌, చెంగిచర్ల, ఉప్పల్‌ వైపు నుంచి భాగ‌య‌త్ లే అవుట్‌ నుంచి నాగోల్‌ వైపు వచ్చే వాహనాలు, హెచ్‌ఎండీఏ లే అవుట్ నుంచి బోడుప్పల్‌, చెంగిచర్ల ఎక్స్‌ రోడ్డు వైపు ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు తార్నాక వైపు నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు తార్నాక వైపు నుంచి వెళ్లాలని సూచించారు. 

Tags:    

Similar News