చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డికి మద్దతుగా మేయర్​ ఎన్నికల ప్రచారం

చేవెళ్ల పార్లమెంట్​ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ కార్యదర్శి, బడంగ్ పేట్​ మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అభ్యర్థించారు.

Update: 2024-04-28 13:09 GMT

దిశ, బడంగ్​ పేట్​ : చేవెళ్ల పార్లమెంట్​ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ కార్యదర్శి, బడంగ్ పేట్​ మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అభ్యర్థించారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్​ మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ లో శ్రీవిద్య టౌన్షిప్ ఫేస్ 2 కాలనీలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగుల ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, పెద్ద బావి సమర సింహారెడ్డి,నారాయణ గౌడ్, పరమేష్, మల్లయ్య, గిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

Similar News