రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కడ్తాల్ మండల పరిధి టాక్ రాజ్ గూడ వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2022-11-27 04:29 GMT

దిశ, ఆమనగల్లు : కడ్తాల్ మండల పరిధి టాక్ రాజ్ గూడ వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వడ్త్యావత్ జగన్ (38) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రేఖ్య తండా పంచాయతీ పరిధి టాక్ రాజ్ తండాకు చెందిన వడ్త్యావత్ జగన్ పౌల్ట్రీ ఫార్మ్ నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి ఇంటి నుంచి పౌల్ట్రీ ఫామ్‌కు తండ్రి కొడుకులు బయలుదేరారు. మార్గమధ్యలో కడ్తాల్-షాద్నగర్ ప్రధాన రహదారిపై కంకర లోడుతో ఉన్న టిప్పర్ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా రోడ్డుపై నిలిపి వెళ్లారు. అది గమనించని జగన్ తన ద్విచక్ర వాహనంతో వెనుక వైపు నుండి టిప్పర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జగన్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడుకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

Read more:

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

Tags:    

Similar News