రంజిత్​ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్​

ప్రధానిగా రాహుల్​ గాంధీ బాధ్యతలు స్వీకరించగానే తెలంగాణ పథకాలను దేశమంతటా పక్కాగా అమలు చేస్తారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్​పేట్​ మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు.

Update: 2024-05-05 13:40 GMT

దిశ, బడంగ్ పేట్​ : ప్రధానిగా రాహుల్​ గాంధీ బాధ్యతలు స్వీకరించగానే తెలంగాణ పథకాలను దేశమంతటా పక్కాగా అమలు చేస్తారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్​పేట్​ మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో భాగంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 30వ డివిజన్ లోని రోమా ఫేస్ 3,4 కాలనీ, సుమా ప్యారడైజ్ కాలనీ, ఎం.సి.ఆర్ కాలనీ లలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్​ గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కాలనీవాసులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా బడంగ్ పేట్​ మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే మహిళలకు తెలంగాణలో నెలకు రూ.2,500 చెల్లిస్తారన్నారు. మే 13వ తేదీన జరుగనున్న పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ హస్తం గుర్తుకు ఓటువేసి చేవెళ్ల పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి రంజిత్​ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, రాళ్ళ గూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, సుదర్శన్ రెడ్డి , సూర్ణగంటి విజయ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News