రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్
ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించగానే తెలంగాణ పథకాలను దేశమంతటా పక్కాగా అమలు చేస్తారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు.
దిశ, బడంగ్ పేట్ : ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించగానే తెలంగాణ పథకాలను దేశమంతటా పక్కాగా అమలు చేస్తారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 30వ డివిజన్ లోని రోమా ఫేస్ 3,4 కాలనీ, సుమా ప్యారడైజ్ కాలనీ, ఎం.సి.ఆర్ కాలనీ లలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కాలనీవాసులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే మహిళలకు తెలంగాణలో నెలకు రూ.2,500 చెల్లిస్తారన్నారు. మే 13వ తేదీన జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటువేసి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, రాళ్ళ గూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, సుదర్శన్ రెడ్డి , సూర్ణగంటి విజయ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.