కేటీఆర్ రోడ్ షో ను విజయవంతం చేయండి : సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్ల పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఈ నెల 6 వ తేదీన జరిగే కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

Update: 2024-05-05 13:10 GMT

దిశ, బడంగ్ పేట్​ : చేవెళ్ల పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఈ నెల 6 వ తేదీన జరిగే కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాడు సాయంత్రం 5 గంటలకు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర, సాయంత్రం 6 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి గణేష్ నగర్ చౌరస్తా వద్ద, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయంత్రం 7 గంటలకు రోడ్ షో కార్నర్ మీటింగ్ లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,, కార్పొరేటర్లు,ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ పాల్గొంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్రలకు విశేష స్పందన వస్తుందని,గ్రేటర్ పరిధిలో కేటీఆర్ ప్రచారానికి కూడా అన్యుహ స్పందన వస్తుందని మాజీ మంత్రి పేర్కొన్నారు.

Similar News