సామాన్య ప్రజలకు షాక్.. ఏకంగా రూ.70 పెరిగిన వంటనూనె ధర

దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సామాన్యులకు 'ఆయిల్' షాక్ తగిలింది. వంటనూనె

Update: 2022-03-21 06:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సామాన్యులకు 'ఆయిల్' షాక్ తగిలింది. వంటనూనె ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లులు పడుతున్నాయి. ఆయిల్ కొనాలంటేనే జంకుతున్నారు. గత నెలరోజులోనే ఏకంగా రూ.70 వంటనూనె ధర పెరిగింది. గతంలో కిలో నూనె ధర రూ.120 నుంచి రూ.140 మధ్య ఉంది. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో దిగుమతి తగ్గిపోయింది. దీని వల్ల వంటనూనెకు డిమాండ్ ఏర్పడటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. 

Tags:    

Similar News