నేడు కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై నేడు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది.
దిశ, వెబ్డెస్క్: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై నేడు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేశారు. కవిత అరెస్ట్కు సరైన కారణాలు లేవని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలపారు. అయితే సీబీఐ న్యాయవాదులు మాత్రం కవితకు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విని కోర్టు నేటికి తీర్పును వాయిదా వేసింది. దీంతో కవిత బెయిల్పై నేడు సీబీఐ ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వులు ఇవ్వనుంది.