బీజేపీవైపే దేశప్రజల చూపు : బూర

దేశ ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని, ఇందుకు నిదర్శనమే గుజరాత్ లో ఆ పార్టీ అఖండ విజయం సాధించడం అని భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు.

Update: 2022-12-09 13:09 GMT

దిశ, చిట్యాల : దేశ ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని, ఇందుకు నిదర్శనమే గుజరాత్ లో ఆ పార్టీ అఖండ విజయం సాధించడం అని భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం చిట్యాల పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజార్టీతో విజయం సాధించడం అవినీతి రహిత పాలనకు నిదర్శనమని అన్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఓడినప్పటికీ పోలింగ్ శాతాన్ని పెంచుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు పూర్తిగా అవినీతిమయమైనవని, రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు కానీ అమలు చేసే సంక్షేమ పథకాలు కానీ అవినీతితో కూడుకొని ఉన్నాయని ఆయన ఆరోపించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వల నిర్మాణంలో జరిగిన అవినీతిని ఎండగట్టి ప్రజల ముందు టీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి, అహంకారంతో కూడుకున్న పాలన కొనసాగుతుందని, త్వరలోనే దానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, నకిరేకల్ అసెంబ్లీ ఇన్చార్జ్ యాదగిరి రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మైళ్ళ నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు శేపూరి రవీందర్, నకరికంటి మొగులయ్య, మండలి వెంకన్న, పట్టణ అధ్యక్షుడు కోరేళ్ళ శ్రీను, మాస శ్రీను, గాడిద సురేష్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News