దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం

దేశంలో‌ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-08 09:04 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : దేశంలో‌ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం‌ భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో మార్నింగ్ వాకర్స్ ను ఓటు అభ్యర్థించారు. వాకింగ్, రన్నింగ్ చేస్తూ వాకర్స్ తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు చూపుతూ ఈ నెల 13న జరిగే ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కూరగాయల వ్యాపారులను,

    టిఫిన్ సెంటర్స్, టీ స్టాల్స్, చికెన్ సెంటర్స్, వ్యాపారులను ఓటు అభ్యర్థించారు. భువనగిరి రైల్వే స్టేషన్లో రైల్వే ప్రయాణికులను కలిశారు. రైల్వే ప్రయాణికులు వారి సమస్యలను వెలిబుచ్చారు. గత పది సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ప్రయాణికుల సమస్యలు పట్టించుకోలేదని ,ఇప్పుడు రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉందని, దేశంలో రాబోయేది కూడా ఇండియా కుటమేనని, కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ప్రయాణికులకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఆటో నడిపిన చామల....

భువనగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఆటో నడిపి ఆటో రిక్షా కార్మికులను ఓటు అభ్యర్థించారు. పెట్రోల్ బంక్ లో వినియోగదారులను కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.‌ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ కోఆర్డినేటర్ శిరీష్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ పోత్నక్ ప్రమోద్ కుమార్, కుంభం కీర్తి రెడ్డి, పీసీసీ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్ , మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, నియోజకవర్గ సేవాదళ్ నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు. 

Similar News