'అయ్యయ్యో ఇప్పుడు ఎలక్షన్‌లో నా మీద ఎవరు వెంటాడి, వేటాడి నిలబడతారు?'

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Update: 2022-12-01 07:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'అయ్యయ్యో... ఇప్పుడు ఎలెక్షన్లో నా మీద ఎవరు వెంటాడి, వేటాడి నిలవడతరు??' అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు ఓ వీడియోను కూడా జత చేస్తూ ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల అర్వింద్, కవితల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అర్వింద్ తనపై వ్యక్తి గత విమర్శలు చేస్తున్నాడని కవిత మండిపడ్డారు. అర్వింద్‌ను చెప్పుతోకొడతానని, తాను ఎక్కడ పోటీ చేసినా వెంటాడి మరి పోటీ చేసి ఓడిస్తానంటూ కవిత సవాలు చేసిన సంగతి తెలిసిందే. 

Read More.....

కేసీఆర్ ఖాసీం రజ్వీ: బండి సంజయ్ 

Tags:    

Similar News