ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం : ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
దిశ,కూకట్పల్లి : కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గం పరిధికి చెందిన 52 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నిరుపేద ఆడబిడ్డల పెళ్లిలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, పగుడాల శిరీష బాబురావు, సబీహ బేగం, పండాల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.