పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.. కార్పొరేటర్ ప్రభుదాస్

వెంకటేశ్వరనగర్‌, తిరుమలనగర్‌లో ఇటీవల చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ పనులను కార్పొరేటర్‌ జెర్రిపోతుల ప్రభుదాస్‌ పరిశీలించారు.

Update: 2023-02-02 11:02 GMT

దిశ, నాచారం: మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలోని వేంకటేశ్వర నగర్, తిరుమలనగర్ కాలనీల్లో ఇటీవల చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ గురువారం పరిశీలించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, కాలనీ సెక్రటరీ వీరభద్రరావు, కొయ్యడ జైపాల్, నవీన్ గౌడ్, శేఖర్ గౌడ్, కుమార్, నిసార్ అహ్మద్ గోరి, దండెం నరేందర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Similar News