ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చే బాధ్యత నాది : ఈటల

ఉప్పల్ నియోజవర్గం రామంతపూర్ వంశరాజ్ సంఘ భవనంలో ఉప్పల్

Update: 2024-05-08 14:43 GMT

దిశ,ఉప్పల్: ఉప్పల్ నియోజవర్గం రామంతపూర్ వంశరాజ్ సంఘ భవనంలో ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు గడ్డం సాయి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కుల సంఘాల ఆత్మీయ సమావేశంలో మల్కాజ్గిరి బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ మళ్లీ భారతదేశం పూర్వకాలంలో విశ్వగురు స్థానంలో ఉందో అదే విశ్వగురు స్థానం సాధించాలంటే మళ్ళీ మోడీ ప్రధానమంత్రి కావాలి అని, ఇక్కడ ఓటు వేసి గెలిపిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు అన్నారు. కాబట్టి వారి అండదండలు వారి సహకారం ఉంటాయి కనుక వారి వ్యక్తిగా ఇక్కడ నిలబడితే మీ ఆశీర్వాదం పొందుతే ఈ నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య, ఫ్లైఓవర్లు, నీటి సమస్య ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా తీర్చే బాధ్యత నాది అని తెలిపారు.

అలాగే మంత్రిగా పనిచేసిన సమయంలో కుల సంఘాలకు ఆత్మ గౌరవ భవనాలు ఉండాలని చెప్పి 78 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు హైటెక్ సిటీ,ఉప్పల్ భగాయత్ లో భూములు ఇప్పించడానికి కృషి చేసిన వ్యక్తిని, అలాగే ప్రభుత్వ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులకు కడుపునిండా అన్నం దొరకాలని చెప్పి సన్నబియ్యం పథకం పెట్టించింది కూడా నేనే , సామాన్య కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటాయో నాకు తెలుసు కాబట్టి మీయొక్క కుటుంబాల అభివృద్ధికి కృషి చేసే బిడ్డగా మీ ఆశీర్వాదంతో నన్ను ఎంపీగా గెలిపిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. సబ్బండ కులాల ఆత్మీయత అభిమానం నాకు దొరికినందుకు చాలా గర్వంగా ఉంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు, గడ్డం సాయి కిరణ్, సంఘం సూర్యారావు, మల్లేష్ వంశరాజ్, సత్యం వంశరాజ్, కృష్ణ వంశరాజ్, వడ్డెర సంఘం,ఉప్పర సంఘం,సగర సంగం,గంగపుత్ర సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘం,విశ్వబ్రాహ్మణ,కుమ్మరి, రజక, మందుల,మహేంద్ర, మాల,మాదిగ, పద్మశాలి,ఇతర కుల సంఘాల నాయకులు పాల్గొని ఈటెల రాజేందర్ కి మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు.

Similar News