నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్న పోలీసులు(వీడియో)
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీ నాయకులు ప్రచారాల దూకుడు ఎక్కువైంది.
దిశ, వెబ్డెస్క్: నడిరోడ్డుపై ప్రజలు చూస్తుండగానే పోలీసుల నిర్వాకం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్లు చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఏమైందో తెలియదు కానీ రొళ్ల పీఎస్కు చెందిన నారాయణ స్వామి నాయక్.. అగళి పీఎస్కు చెందిన శివకుమార్ గొవడకు దిగారు. మాట మాట ఎక్కువై గళ్ల పట్టుకుని కొట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే బూతులు తిట్టుకుంటూ చొక్కాలు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నలుగురికి చెప్పాల్సిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని విమర్శకంగా కామెంట్స్ చేస్తున్నారు.