ఏసీబీకి చిక్కిన గుండు మాల్ తహశీల్దార్ పాండు నాయక్

నారాయణపేట జిల్లా గుండు మాల్ మండల తహశీల్దార్ పాండు నాయక్‌ను ఏసీబీ డీఎస్పీ బి. శ్రీకృష్ణ గౌడ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Update: 2024-03-27 13:16 GMT

దిశ, గుండు మాల్: నారాయణపేట జిల్లా గుండు మాల్ మండల తహశీల్దార్ పాండు నాయక్‌ను ఏసీబీ డీఎస్పీ బి. శ్రీకృష్ణ గౌడ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతు మల్లేష్ దగ్గర తహశీల్దార్ రూ. 3000 లంచం డిమాండ్ చేశాడు. ఎందుకు అని అడగగా ఇక్కడ అలాగే ఉంటుందని సమాధానం ఇచ్చాడు. దీంతో రైతు మల్లేష్ ఏసీబీకి సమాచారం ఇవ్వగా డీఎస్పీ తహశీల్ధార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Similar News