రోడ్డు ప్రమాదంలో మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని నిమ్మగూడెం గ్రామ సమీపంలో గట్టమ్మ దేవాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.

Update: 2024-05-09 15:54 GMT

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని నిమ్మగూడెం గ్రామ సమీపంలో గట్టమ్మ దేవాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. మహా ముత్తారం సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్ర కుమార్ కథనం ప్రకారం స్తంభంపెళ్లి గ్రామ సర్పంచ్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జాడి రాజయ్య , భార్య , మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు కీర్తి భాయ్ ఇద్దరూ కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కారులో పెగడపల్లి గ్రామానికి వెళ్తున్నారు. జాడి రాజయ్య భార్య కీర్తి భాయ్ ఇద్దరు భార్యాభర్తలు కారులో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది.

రోడ్డు కిందికి కారు దూసుకెళ్లడంతో కారులో ఉన్న మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు జాడి కీర్తి భాయి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న సర్పంచ్ జాడి రాజయ్య తీవ్ర గాయాల పాలవడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించినట్లు తెలిపారు. పెగడపల్లికి వెళ్లే ముందు మండలంలోని యామనపల్లి వద్ద పలువురుతో మాట్లాడారు. కొద్దిసేపటికి ఈ ప్రమాదం జరిగి జాడి కీర్తి బాయ్ మరణించడంతో మండల కాంగ్రెస్ పార్టీలో విషాదం అలుముకుంది. కారు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రావు సందర్శించారు. రోడ్డు ప్రమాదం జరిగిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News