దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అండ

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కామేపల్లి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ ఆర్. శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.

Update: 2022-12-06 10:13 GMT

దిశ, కామేపల్లి : దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కామేపల్లి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ ఆర్. శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కామేపల్లి మండల వ్యాప్తంగా ఎన్ సీడీ బాధితులకు కిట్లను పంపిణీ చేస్తున్నట్లువెల్లడించారు. రోగులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని,మందుల కిట్లను అందిస్తూ భరోసా నింపుతున్నదని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల బాధితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా మందులను వాడి ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఊట్కూరు సబ్ సెంటర్ లో అసంక్రమిత వ్యాధిగ్రస్తులకు ఏఎన్ఎం యస్.రమాదేవి, ఆశా కార్యకర్తలు కె.లింగమ్మ, వై. సుమతి, ఇ.అనసూర్య పాల్గొన్నారు.


Similar News