‘రేవంత్ రెడ్డి మీద ఒట్టు మాకు ఒక్క రూపాయి బిళ్ల రాట్లేదు’.. ఖమ్మం ప్రజల ఆవేదన

రేవంత్ రెడ్డి మీద ఒట్టు మాకు ఒక్క రూపాయి కూడా రావట్లేదంటూ ఖమ్మం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-04-30 12:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి మీద ఒట్టు మాకు ఒక్క రూపాయి కూడా రావట్లేదంటూ ఖమ్మం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో ఖమ్మం ప్రజలు మాట్లాడుతూ.. సీఎంపై సంచలన కామెంట్స్ చేశారు. నెలకు 2500 వస్తున్నాయా..? అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. అమ్మతోడు ఎవ్వరికి కూడా ఆయన ఒక్క రూపాయి బిల్లా కూడా ఇవ్వలేదని అన్నారు. ఇస్తే ఇచ్చాడని చెబుతామన్నారు. మా నాన్నకు కేసీఆర్ ఇచ్చిన ఫించనే తప్ప ఇంతవరకు మాకు ఎలాంటి డబ్బులు రాలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి మీద తోడు నిజంగానే చెబుతామన్నామని ఖమ్మం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News