లిక్కర్ స్కాం కేసు.. నేడు కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు వెలువడనుంది.
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు వెలువడనుంది. లిక్కర్ స్కాం ఈడీ, సీబీఐ కేసులో కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. నేడు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెల్లడించనున్నారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ హైదరాబాద్ లోని తన నివాసంలో అరెస్ట్ చేయగా.. తీహార్ జైలులో ఉన్న ఆమెను సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మే 2న తీర్పు వస్తుందని అంతా భావించగా.. మే 6కు తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. కాగా, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత బెయిల్ తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.