అతివేగం.. మృత్యుపాశం!!.. సజ్జనార్ ట్వీట్ కు బిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై అవగాహాన కల్పించే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.

Update: 2024-05-26 11:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై అవగాహాన కల్పించే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఈ నేపధ్యంలోనే రోడ్డు ప్రమాదంపై సజ్జనార్ పెట్టిన వీడియోకు నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ స్కూటీపై రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ.. అదే రోడ్డుపై అతి వేగంగా వస్తున్న ఓ బైక్ ను చూసి రోడ్డు నడి మద్యలో ఆగింది. ఓవర్ స్పీడ్ లో ఉన్న ఆ బైక్ రోడ్డు మధ్యలో ఉన్న స్కూటీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో ఆ బైకర్ తో పాటు స్కూటీ నడిపై మహిళ కూడా దూరంగా వెళ్లి పడ్డారు. దీనిపై అతివేగం.. మృత్యుపాశం!! అని సజ్జనార్ రాసుకొచ్చారు. అయితే దీనిపై నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. ఆ వీడియోపై రొడ్డు మధ్యలో వచ్చి అలా ఆగిపోతే ఎలా సార్ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. బైక్ స్పీడ్ లో ఉండటం స్పష్టంగా అర్ధం అవుతుంది కానీ ఈ యాక్సిడెంట్ కు మూల కారణం మాత్రం ఆ మహిళే అని మరో నెటిజన్ అన్నారు. ఇక మరో నెటిజన్ ఇది మహిళల తప్పు కాదు పూర్తిగా పురుషులదే.. ఈ విషయాలను చట్టాలు అంగీకరించవు అని కామెంట్ పెట్టాడు.

Similar News