ప్రాణం తీసిన రాంగ్ రూట్ డ్రైవింగ్

రాంగ్ రూటులో వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా పలువురు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2023-06-02 09:43 GMT

దిశ, ముషీరాబాద్ : రాంగ్ రూటులో వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా పలువురు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 31 వ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సురేష్ కార్వా ( 30 ) తన ద్విచక్ర వాహనం పై సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వైపు వెళ్లడానికి ట్యాంక్ బండ్ పైకి వచ్చారు. రాంగ్ రూటులో వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. సురేష ను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడని సీఐ మోహన్ రావు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వారిలో కొంత మందికి గాయాలు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News