రిజర్వేషన్లపై ఫేక్ వీడియో.. కాంగ్రెస్‌కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

రిజర్వేషన్లపై తాను మాట్లాడినట్లుగా వైరల్ అవుతున్న ఫేక్ వీడియో ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు.

Update: 2024-04-29 14:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వేషన్లపై తాను మాట్లాడినట్లుగా వైరల్ అవుతున్న ఫేక్ వీడియో ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. ఫేక్ వీడియోలతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కూటమి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ ఖాయమన్నారు. మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని అమిత్ షా అన్నారు. కాగా, ఫేక్ వీడియో కేసులో సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 

Similar News