బీజేపీ నేతకి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

బీజేపీ ముధోల్ నియోజక వర్గ నేత భోస్లే మోహన్ రావ్ పాటిల్ కి తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Update: 2023-06-02 11:29 GMT

దిశ, బైంసా : బీజేపీ ముధోల్ నియోజక వర్గ నేత భోస్లే మోహన్ రావ్ పాటిల్ కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం పల్లె పల్లె కు బీజేపీ గడప గడపకు మోహన్ రావ్ పాటిల్ అనే కార్యక్రమ నిమిత్తం కార్యకర్తలను కలవడానికి వెళ్తున్నారు. రేపటి కార్యక్రమం లో భాగంగా కార్యాచరణ కోసం వెళ్తున్న తరుణంలో బైంసా మండలం దేగం గ్రామం సమీపాన తాను ప్రయాణిస్తున్న వాహనానికి ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. వాహనానికి ఒక వైపు డ్యామేజ్ కాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

Similar News