బ్రేకింగ్ : ఖమ్మం జిల్లాలో యాక్సిడెంట్స్ టెర్రర్.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

ఖమ్మం జిల్లాలో రోడ్లు నెత్తురొడాయి.

Update: 2023-06-01 02:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో రోడ్లు నెత్తురొడాయి. కొణిజర్లలో లారీ-కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు వైరా మండలం విప్పల మడక వాసులుగా గుర్తించారు. కల్లూరు మండలం రంగంబంజరలో ఆటోను లారీ ఢీకొట్టింది. సాయితేజ అనే యువకుడు మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మరో రోడ్డు ప్రమాదంలో రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ఘటన పెనుబల్లి మండలం వీఎం బంజారాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ లో ఇరుక్కుని ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. 

Tags:    

Similar News