గిరిజనులతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన మంత్రి పొన్నం

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ హూస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో రోడ్ షో నిర్వహించారు.

Update: 2024-04-30 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ హూస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం బంజారా మహిళలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సన్నివేశాన్ని తిలకించిన ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. ఈ ప్రచారంలో పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. అంతకుముందు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌తో కలిసి పొన్నం ఓ హోటల్ లో టిఫిన్ చేస్తూ కార్యకర్తలతో ముచ్చటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Similar News