హరీశ్‌రావు నియోజకవర్గంలో ఘోరం

దిశ, సిద్ధిపేట: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఆస్పత్రులకు వెళాలంటేనే గజగజ వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఆస్పత్రుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వాధికారులు తమకేమీ పట్టనట్లు ఉంటున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. ఇందుకు ప్రత్యేక ఉదాహరణగా సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం ఉన్న అద్వాన పరిస్థితి. ఈ ఆసుపత్రి ప్రముఖ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలోనే ఉంది. ఈ ఆసుపత్రిలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ తీరు అధ్వానంగా తయారైంది. […]

Update: 2020-07-25 01:43 GMT

దిశ, సిద్ధిపేట: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఆస్పత్రులకు వెళాలంటేనే గజగజ వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఆస్పత్రుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వాధికారులు తమకేమీ పట్టనట్లు ఉంటున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. ఇందుకు ప్రత్యేక ఉదాహరణగా సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం ఉన్న అద్వాన పరిస్థితి.

ఈ ఆసుపత్రి ప్రముఖ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలోనే ఉంది. ఈ ఆసుపత్రిలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ తీరు అధ్వానంగా తయారైంది. మరుగుదొడ్లను వాడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రుల నిర్వహణ తీరుపై పలువురు విమర్శిస్తున్నారు. మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో ఆస్పత్రుల నిర్వహణ తీరు ఇలా ఉంటీ మిగతా చోట్ల ఏలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News