పీటీఐ మహిళా రిపోర్టర్పై ‘ఏఎన్ఐ’ రిపోర్టర్ దాడి!
జాతీయ చానల్లో పనిచేసే ఓ మహిళ రిపోర్టర్పై మరో చానల్కు సంబంధించిన రిపోర్టర్ దాడి చేశారని ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ చానల్లో పనిచేసే ఓ మహిళ రిపోర్టర్పై మరో చానల్కు సంబంధించిన రిపోర్టర్ దాడి చేశారని ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇవాళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రెస్ మీట్లో రెండు జాతీయ మీడియా ఛానల్ రిపోర్టర్ల మధ్య గొడవ ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) చానల్ మహిళా రిపోర్టర్పై ఏఎన్ఐ చానల్ రిపోర్టర్ దాడి చేశారు. వెంటనే అక్కడ ఉన్నవారు వారికి నచ్చజెప్పి గొడవ సద్దుమనిగించారు.
ఈ గొడవకు సంబంధించిన వీడియో పీటీఐ పోస్ట్ చేసింది. తమ మహిళ రిపోర్టర్పై దాడిని ఖండించింది. ఒక యువ మహిళ రిపోర్టర్పై లైంగిక వేధింపులతో శారీరకంగా దాడి చేసి, మాటలతో దుర్భాషలాడిన ఏఎన్ఐ రిపోర్టర్ ది అసహ్యకరమైన ప్రవర్తన అని పీటీఐ పేర్కొంది. మీ సిబ్బంది ప్రవర్తనను మన్నిస్తారా? అని ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాశ్ను పీటీఐప్రశ్నించింది. పీటీఐ తన ఉద్యోగులను రక్షించేందుకు ఎంతకైనా తెగిస్తుందని పేర్కొంది. రిపోర్టర్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ షాకింగ్ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని తెలిపారు. జాతీయ మహిళా కమిషన్కి కూడా ఈఘటనపై ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది.