సహించే ప్రసక్తే లేదు -మోపిదేవి

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనం కోసం మత కలహాలు సృష్టించేందుకు కొందరు కుట్రకు పాల్పడుతున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించే […]

Update: 2020-09-26 09:18 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనం కోసం మత కలహాలు సృష్టించేందుకు కొందరు కుట్రకు పాల్పడుతున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News