నేడు ఆ నియోజకవర్గంలో పవన్ పర్యటన.. హెలిప్యాడ్‌ను ధ్వంసం చేసిన దుండగులు..

Update: 2024-05-04 03:43 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు అధికార పార్టీ నేతలు, ఇటు ప్రతిపక్ష నేతలు గెలుపే ధ్యేయంగా అడుగులేస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే.

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాకు పవన్ కళ్యాణ్ హెలీకాఫ్టర్‌లో రానున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రయాణించనున్న హెలీకాఫ్టర్‌ ల్యాండింగ్ కోసం పొన్నూరులో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. అయితే ఆ హెలిప్యాడ్‌‌ను దుండగులు ధ్వంశం చేశారు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జేసిబినీ ఉపయోగించి పవన్ కళ్యాణ్ ప్రయాణించనున్న హెలీకాఫ్టర్‌ ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌‌ను తవ్వేశారు.

దీనితో పవన్ కళ్యాణ్ పర్యటన ఆదివారానికి వాయిదా పడింది. కాగా నేడు గుడివాడలోని నెహ్రూ చౌక్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో 11 గంటలకు పవన్ పాల్గొనాల్సి ఉంది. అక్కడ నుండి ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు నియేజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాలికలు రూపొందించారు. అయితే.. హెలిప్యాడ్‌‌ను దుండగులు ధ్వంశం చేయడంతో పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడిందని సమాచారం.

Read More..

ప్రకాశం జిల్లా వరప్రదాయనిపై పవన్ కీలక వ్యాఖ్యలు

Tags:    

Similar News