ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం.. పరామర్శించిన రేఖ

దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుఝామున కవితా కరణ్ సింగ్ కు చెందిన ఇంటిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. విషయం తెలుసుకున్న ఏమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆదుకుంటామని చెప్పారు. రెవెన్యూ వర్గాలు పంచనామా చేసి ఆస్థి నష్టం అంచనా వేస్తున్నాయి.

Update: 2020-08-31 02:08 GMT

దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుఝామున కవితా కరణ్ సింగ్ కు చెందిన ఇంటిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. విషయం తెలుసుకున్న ఏమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆదుకుంటామని చెప్పారు. రెవెన్యూ వర్గాలు పంచనామా చేసి ఆస్థి నష్టం అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News