భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఏపీ ఉద్యోగ సంఘాలు రెడీ అయ్యాయి. ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ఎన్జీవో జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. చేపట్టే కార్యక్రమాలు డిసెంబర్ 1న ఏపీ  సీఎస్‌కు వినతి పత్రం అందజేయాలి నిర్ణయించారు.  1న జిల్లాల కేంద్రాల్లో నిరసన చేపట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా 7 నుంచి 10 వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలి. 10న  నల్ల బ్యాడ్జీలతో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన […]

Update: 2021-11-28 09:17 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఏపీ ఉద్యోగ సంఘాలు రెడీ అయ్యాయి. ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ఎన్జీవో జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. చేపట్టే కార్యక్రమాలు డిసెంబర్ 1న ఏపీ సీఎస్‌కు వినతి పత్రం అందజేయాలి నిర్ణయించారు.

1న జిల్లాల కేంద్రాల్లో నిరసన చేపట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా 7 నుంచి 10 వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలి. 10న నల్ల బ్యాడ్జీలతో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టాలి. జిల్లా తాలూకా కేంద్రాల్లో 16 న ధర్నాలు పెద్ద ఎత్తున నిర్వహించాలి. 21 న జిల్లా కేంద్రాల్లో రెండు గంటల వరకు మహా ధర్నా చేపట్టాలి. 27 విశాఖ, 30న తిరుపతి, 3న ఏలూరు, 6న ఒంగోలులో భారీ ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ కార్యచరణను ప్రకటించాయి.

Tags:    

Similar News