LAC వెంబడి కాల్పులు : చైనా

దిశ, వెబ్‌డెస్క్ : భారత్-చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి గత మూడు నెలులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి తెలిసిందే. అయితే, సరిహద్దు ప్రాంతమైన తూర్పు లద్దాక్‌లో తాజాగా కాల్పులు చోటుచేసుకున్నాయని డ్రాగన్ కంట్రీ ధృవీకరించినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులను భారత్ భద్రతా బలగాలు జరిపాయని చైనా ఆరోపిస్తుంది. కాగా, చైనా ఆరోపణలపై భారత రక్షణ వర్గాలు ఇంకా స్పందించలేదు. ఇదిలాఉండగా, ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కారించుకుందామని ప్రకటిస్తూనే జిత్తులమారి డ్రాగన్ […]

Update: 2020-09-07 20:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత్-చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి గత మూడు నెలులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి తెలిసిందే. అయితే, సరిహద్దు ప్రాంతమైన తూర్పు లద్దాక్‌లో తాజాగా కాల్పులు చోటుచేసుకున్నాయని డ్రాగన్ కంట్రీ ధృవీకరించినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులను భారత్ భద్రతా బలగాలు జరిపాయని చైనా ఆరోపిస్తుంది. కాగా, చైనా ఆరోపణలపై భారత రక్షణ వర్గాలు ఇంకా స్పందించలేదు.

ఇదిలాఉండగా, ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కారించుకుందామని ప్రకటిస్తూనే జిత్తులమారి డ్రాగన్ బోర్డర్‌లో సైన్యాన్ని, ఆధునాతన యుద్ధ సామగ్రిని మొహరిస్తోంది. డ్రాగన్ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే శాటిలైట్ల ద్వారా బోర్డర్లో జరిగే పరిణామాలను భారత రక్షణ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News