టీడీపీలో ప్రతి కార్యకర్తా అధ్యక్షుడితో సమానమే: నారా లోకేశ్

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీలో ప్రతి కార్యకర్తా అధ్యక్షుడితో సమానమేనని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా తెలిపారు. ట్విట్టర్ మాధ్యమంగా వైఎస్సార్సీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ గారికి మేటర్ వీక్ అనే విషయం పేటీఎమ్ బ్యాచ్‌కి అర్థం అయిపోయింది. అందుకే 5 రూపాయల చిల్లర కోసం తుప్పు పట్టిన బుర్రలకు పనిపెట్టి… టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో నాయకుల మధ్య వివాదం అంటూ ఫేక్ అకౌంట్లతో రచ్చ చేస్తున్నారు’ […]

Update: 2020-06-09 03:01 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీలో ప్రతి కార్యకర్తా అధ్యక్షుడితో సమానమేనని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా తెలిపారు. ట్విట్టర్ మాధ్యమంగా వైఎస్సార్సీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ గారికి మేటర్ వీక్ అనే విషయం పేటీఎమ్ బ్యాచ్‌కి అర్థం అయిపోయింది. అందుకే 5 రూపాయల చిల్లర కోసం తుప్పు పట్టిన బుర్రలకు పనిపెట్టి… టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో నాయకుల మధ్య వివాదం అంటూ ఫేక్ అకౌంట్లతో రచ్చ చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఇక మరో ట్వీట్‌లో ‘అన్నదమ్ముల్లా ఉన్న నాకు, ఎంపీ రామ్‌ మోహన్‌ నాయుడి మధ్య గొడవలు పెట్టాలని ప్రయాస పడుతున్న పేటీఎం బ్యాచ్ ఆవేశానికి నా సానుభూతి. మీ ప్రయత్నాలు టీడీపీ నాయకుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. టీడీపీలో ప్రతి కార్యకర్తా అధ్యక్షుడితో సమానమే అని విషయం వైకాపా పేటీఎం బ్యాచ్‌కి గుర్తుచేస్తున్నాను’ అని పేర్కొన్న ట్వీట్‌తో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు దుష్ప్రచారం చేస్తున్న పోస్టుల స్క్రీన్ షాట్లను కూడా జత చేశారు.

Tags:    

Similar News