కారులో తరలిస్తున్న రూ.2 కోట్లకు పైగా నగదు పట్టివేత..

నగరంలో మంగళవారం రూ.2 కోట్లకు పైగా నగదు పట్టుబడింది.

Update: 2024-04-30 07:55 GMT

దిశ ప్రతినిధి,అనంతపురం: నగరంలో మంగళవారం రూ.2 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. పోలీసులు విద్యుత్ నగర్ సర్కిల్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఫార్చ్యూనర్ కారులో నగదుతో కూడిన రెండు బ్యాగులు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఆ బ్యాగుల్లో రెండు కోట్లకు పైగా నగదు ఉన్నట్లు భావిస్తున్నారు. అనంతపురం నుంచి కదిరికి నగదు తరలిస్తుండగా పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆ నగదు ఎవరిది? అందులో ఎంత మొత్తం ఉంది అనే విషయమై ఆరా తీస్తున్నట్టు డీఎస్పీ వీర రాఘవ రెడ్డి తెలిపారు. పంచనామా నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన తెలిపారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద మొత్తంలో నగదు తరలిస్తూ పట్టుబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


Similar News