పుట్ట మధు నాలుగో టార్గెట్ నేనే : ఇనుముల సతీశ్

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు మిగిలిన టార్గెట్ తానేనని మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీశ్ ఆరోపించారు. ఆయన టార్గెట్ చేసిన నలుగురిలో ఒకరిపై పీడీ యాక్టు నమోదు చేయించారని తెలిపారు. మరొకరిని టీఆర్ఎస్‌లో చేర్పించుకున్నారని, మూడో వ్యక్తి అయిన గట్టు వామన్ రావును మట్టు బెట్టారని చెప్పారు. ఇప్పుడు నాలుగో వ్యక్తి అయిన తనను టార్గెట్ చేస్తారేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తన […]

Update: 2021-02-20 09:24 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు మిగిలిన టార్గెట్ తానేనని మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీశ్ ఆరోపించారు. ఆయన టార్గెట్ చేసిన నలుగురిలో ఒకరిపై పీడీ యాక్టు నమోదు చేయించారని తెలిపారు. మరొకరిని టీఆర్ఎస్‌లో చేర్పించుకున్నారని, మూడో వ్యక్తి అయిన గట్టు వామన్ రావును మట్టు బెట్టారని చెప్పారు. ఇప్పుడు నాలుగో వ్యక్తి అయిన తనను టార్గెట్ చేస్తారేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి నలుగురు వ్యక్తులే కారణమంటూ పుట్ట మధు గతంలోనే ప్రకటించారని ఆయన చెప్పారు. ఆయన టార్గెట్లలో నాలుగో వ్యక్తిగా ఉన్న తనకు రక్షణ కల్పించాలని సతీశ్ కోరారు. ఈ విషయంపై డీజీపీని కూడా కలిసి విజ్ఞప్తి చేస్తానని సతీశ్ తెలిపారు.

Tags:    

Similar News