హైదరాబాద్‌లో దారుణం.. నాలాలో కొట్టుకువచ్చిన మృతదేహాలు..!

రాష్ట్ర రాష్ట్రధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షానికి నాలాలో పడి ఇద్దరు మృతి

Update: 2024-05-08 02:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాష్ట్రధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షానికి నాలాలో పడి ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలు బేగంపేట్ వద్దకు నాలాలో కొట్టుకువచ్చాయి. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నాలాలో కొట్టుకువచ్చిన మృతదేహాలు ఎవరివి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News