ఉద్రిక్తత.. మాజీ సర్పంచ్‌కి తీవ్ర గాయాలు

దిశ, వెబ్ డెస్క్: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుని పలువురికి తీవ్ర గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా జామి మండలం పావాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య మంగళవారం ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో మాజీ సర్పంచ్ తోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని […]

Update: 2020-08-18 01:02 GMT

దిశ, వెబ్ డెస్క్: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుని పలువురికి తీవ్ర గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా జామి మండలం పావాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య మంగళవారం ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో మాజీ సర్పంచ్ తోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News