BREAKING: హైదరాబాద్‌లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్

హైదరాబాద్ కేంద్రంగా.. బడా వ్యాపారస్తులే లక్ష్యంగా కొనసాగుతున్న గేమింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Update: 2024-04-30 04:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కేంద్రంగా.. బడా వ్యాపారస్తులే లక్ష్యంగా కొనసాగుతున్న గేమింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నగరానికి చెందిన మాధవి అనే మహిళ బడా వ్యాపారులకు వల వేసి వారిని గేమింగ్‌లోకి దింపుతోంది. ఈ మేరకు ఖాజాగూడలో ఏకంగా ఓ గేమింగ్ స్థావరాన్నే నడుపుతోంది. అదేవిధంగా విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తూ అందిన కాడికి దండుకుంటుంది. అయితే, గేమింగ్ పాల్గొని ఇటీవలే కొంతమంది బడాబాబులు రూ.లక్షల్లో నష్టపోయారు. దీంతో సమాచారం అందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఖాజాగూడలోని గేమింగ్ స్థావరంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ మేరకు రూ.62 వేల నగదును సీజ్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.BREAKING: హైదరాబాద్‌లో గేమింగ్ ముఠా గుట్టురట్టు.. 9మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్      

Tags:    

Similar News