BREAKING: టైర్ బ్లాస్ట్ అయి స్కార్పియోపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లో ఆరుగురు దుర్మరణం

స్కార్పియో బోల్తాపడగా ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన బిహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌ జిల్లాలోని ఘోఘా పోలీస్‌ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-04-30 04:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్కార్పియో బోల్తాపడగా ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన బిహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌ జిల్లాలోని ఘోఘా పోలీస్‌ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్‌హెచ్-80 రహదారిపై ఇనుప రాడ్లను వేసుకుని హెవీ లోడ్‌తో లారీ వెళ్తుండగా టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఈ క్రమంలోనే అదుపు తప్పిన లారీ రోడ్డు పక్కనే పెళ్లి ఊరేగింపుతో వెళ్తున్న స్కార్పియోపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఉన్న 9 మందిలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిథిలాల కింద చిక్కిన ముగ్గురిని రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం భాగల్‌పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి బృందం గోరియా తోలి నుంచి భాగల్‌పూర్‌లోని శ్రీమత్‌పూర్ గ్రామానికి వెళ్తున్నట్లుగా సమాచారం. అ

Tags:    

Similar News