సీఎం జగన్ ఆగ్రహం.. ఎస్ఐ, కానిస్టేబుళ్లు సస్పెండ్

దిశ, వెబ్ డెస్క్ : తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన అవామనీయ ఘటనపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. వెంటనే విచారణ చేపట్టడంతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సీతానగర్ పోలీస్ స్టేషన్ లో యువకుడికి శిరోమండనంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీసీపీని ఆదేశించారు. కాగా ఇదే ఘటనను తీవ్రంగా […]

Update: 2020-07-21 11:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన అవామనీయ ఘటనపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. వెంటనే విచారణ చేపట్టడంతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సీతానగర్ పోలీస్ స్టేషన్ లో యువకుడికి శిరోమండనంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీసీపీని ఆదేశించారు. కాగా ఇదే ఘటనను తీవ్రంగా పరిగణించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ వెంటనే స్పందించి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News