చంద్రబాబు కుప్పం పర్యటనపై నెలకొన్న టెన్షన్

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పంలో నేటి నుంచి మూడు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల తర్వాత చంద్రబాబు పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గుడపల్లె మండలానికి చంద్రబాబు చేరుకోనున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బుధవారం టీడీపీ నేతల ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశారు. […]

Update: 2021-02-24 22:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పంలో నేటి నుంచి మూడు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల తర్వాత చంద్రబాబు పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గుడపల్లె మండలానికి చంద్రబాబు చేరుకోనున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బుధవారం టీడీపీ నేతల ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశారు. కుప్పం వైసీపీ నేతల జాగీర్ కాదని.. చంద్రబాబు పర్యటనను ఎలా అడ్డుకుంటారో చూస్తామని టీడీపీ నేతలు తెలుపుతున్నారు. దీంతో పోలీసు బలగాలు కుప్పంకు చేరుకున్నాయి.

Tags:    

Similar News